కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్- 3 పరీక్షకు 9 నెలల గర్భిణి రీనా హాజరైంది. తన భర్త బాలకృష్ణ సహాయంతో పరీక్షకు హాజరైనట్లు రీనా తెలిపారు. ప్రస్తుతం రీనా కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నట్లు చెప్పారు. తన భర్త బాలకృష్ణ హైదరాబాద్లోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు తెలిపారు.