అయ్యప్ప మాలధారులకు అల్పాహార వితరణ
NEWS Nov 17,2024 03:30 pm
నందలూరు: హైదరాబాదు నుండి శబరిమలకు సుదూర పాదయాత్ర చేస్తూ వెళుతున్న అయ్యప్ప మాల ధారణ భక్త బృందం నందలూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా మన్నెం దేవి, మన్నెం రామమోహన్, ఎస్ఐ ఆఫ్ స్పెషల్ పోలీసులు భక్త బృందం వారికి అల్పాహార వితరణ చేశారు. అంతేకాకుండా మార్గమధ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారికి మందులను ఈగ మధుసూదన్ రెడ్డి (హెల్త్ డిపార్ట్మెంట్) అందజేశారు.