మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామానికి చెందిన సైదల నరేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి హన్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.