కలెక్టర్ గ్రూప్ -3 పరీక్ష కేంద్రాల తనిఖీ
NEWS Nov 17,2024 10:15 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ కే ఎన్ ఆర్ కళాశాలలో తదితర చోట్ల ఏర్పాటుచేసిన గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను ఆదివారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.