జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన గ్రూప్-3 పరీక్షా కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మెట్పల్లికి చెందిన భూమేశ్వర్ రవీందర్ను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించ లేదు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రానికి 4 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న రవళి అనే అభ్యర్థిని పోలీసులు లోనికి అనుమతించలేదు.