కార్యదర్శి గారు కరుణించండి!
NEWS Nov 17,2024 05:54 am
కథలాపూర్ మండలం తక్కలపల్లిలో ఐదుగురిపై కుక్కలు దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. మొగిలి శంకర్, గడ్డం సత్తమ్మ, బర్రె చౌదరి, తోట భారతి, మరో ఒక్కరిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. గత కొంతకాలంగా కుక్కల బెడద ఎక్కువగా ఉంది అని కార్యదర్శికి వినతి పత్రం అందించినా ఫలితం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.