గ్రూప్-3 విద్యార్థుల కోసం హెల్ప్డెస్క్
NEWS Nov 17,2024 04:59 am
కోరుట్ల పట్టణంలో గ్రూప్-3 ఎగ్జామ్ రాయడానికి విచ్చేస్తున్న అభ్యర్థులకు, కోరుట్ల పోలీస్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మెట్పల్లి డీఎస్పీ రాములు ఆదేశాల మేరకు కోరుట్ల ఎస్సై శ్రీకాంత్ సమక్షంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ప్రధానమైన బస్టాండ్ వద్ద, నంది చౌరస్తా వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.