కోరుట్ల పట్టణంలో ఎస్బీఐ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని, స్కూటీలో పెట్టుకొని దుకాణం వద్దకు వచ్చి స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. బైక్ పై వచ్చి చాకచక్యంగా డిక్కి తాళం తీసి లక్ష రూపాయలు దొంగిలించారు ఇద్దరు దొంగలు. దొంగలు స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు ఎత్తుకెళ్తున్న సిసి ఫుటేజ్ వైరల్ అవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.