జ్యోతక్కకు స్వర్ణకారుల నివాళులు
NEWS Nov 16,2024 06:45 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతిదేవి ఇటీవల మృతి చెందగా స్వర్ణకారులు శనివారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె కుటుంబీకులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లందుల కృష్ణమాచారి, ఇల్లందుల కిషన్, ముప్పిడి నరేశ్, ఇల్లందుల రామానుజం, బాజోజి సురేశ్, తునికి భూమయ్య, నిర్మల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.