ఆలయంలో పూజలు చేపట్టిన ఎమ్మెల్యే
NEWS Nov 16,2024 06:49 pm
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 21 వరకు జరగనున్నాయి.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలను లైటింగ్ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.