సభ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రులు
NEWS Nov 16,2024 05:18 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న వరంగల్లో పర్యటించనున్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ సభ ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు సందర్శించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.