కోరుట్లలో స్కూటీ నుండి లక్ష రూపాయలు ఎత్తికెళ్ళిన దొంగలు
NEWS Nov 16,2024 05:00 pm
కోరుట్లలోని గాంధీ రోడ్లో స్కూటీ నుండి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. పల్సర్ బైక్పై వ్యాపారిని దొంగలు వెంబడించినట్టు తెలుస్తోంది. ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేస్కోని స్కూటీలో పెట్టుకొని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు.. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాలం తీసి సీటు కింద ఉన్న డిక్కి నుండి డబ్బులు తస్కరించాడు. సీసీ టీవీలో ఇదంతా రికార్డయింది.