కార్తీకమాసంలో పవిత్ర శబరిమల సన్నిధానంలో అయ్యప్పస్వామి శరణ ఘోషతో మార్మోగిపోతోంది. ఈరోజు దర్శనం కోసం వర్చువల్ క్యూ ద్వారా 70,000 మంది బుక్ చేసుకున్నారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 18 గంటల దర్శన సమయం అందుబాటులో ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు మూసి, మధ్యాహ్నం 3 గంటలకు భక్తుల కోసం తెరిచారు. .