ఇబ్రహీంపట్నంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం
NEWS Nov 16,2024 03:31 pm
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో శనివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సీనియర్ పాత్రికేయులు పి.గిరికుమార్(ఈనాడు), ఎం.నాగేశ్వరరావు(వార్త) కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభమైన రోజునే జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.కార్యక్రమంలో జర్నలిస్టులు అబ్దుల్ హఫీజ్ ఖాద్రీ,డేవిడ్,శ్రీనివాస్, మురళి, రాఘవులు, క్రాంతి, రవీంద్ర, శివ,సత్య, నరేష్, ఆదాం పాల్గొన్నారు.