బోడేపుడికి మోడీ చిత్రపటం బహుకరణ
NEWS Nov 16,2024 03:39 pm
శివాలయం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బోడెపుడి అప్పారావుకు బిజెపి మండల అధ్యక్షులు పయ్యావుల రాము మోడీ చిత్రపటాన్ని బహుకరించారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ శివాలయం నిర్మించి హిందూ ధర్మాన్ని కాపాడుతూ కార్తీక పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ను ఘనంగా సన్మానించారు. అనంతరం దేశ ప్రధాని మోడీ చిత్రపటాన్ని బహుకరించారు. ప్రజలకు విస్తృత సేవలందిస్తున్న ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ ను సందర్భంగా ఘనంగా సన్మానించారు.