గ్రూప్ 3 పరీక్షలకు భద్రత: SP సింధు
NEWS Nov 16,2024 03:40 pm
కామారెడ్డి: గ్రూప్-3 పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని 20 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తమవెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తెచ్చుకోవద్దని తెలిపారు.