పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
NEWS Nov 16,2024 01:29 pm
జిల్లాలో రేపు ఎల్లుండి నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షల కేంద్రాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం సందర్శించారు. అనంతరం పరీక్ష గదులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు. పరీక్ష జరిగే సమయాల్లో ఎలాంటి అవాంతర ఘటనలు జరుగకుండా పరీక్ష సజావుగా జరిగే విధంగా చూసుకోవాలన్నారు.