వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి
NEWS Nov 16,2024 05:07 pm
కామారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసికందు లోకం చూడకుండానే కడుపులోనే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధకు మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించగా, రెండో కాన్పు కోసం శనివారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ మృతి చెందిందని, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.