మల్లాపూర్లో దొంగల హల్చల్
NEWS Nov 16,2024 07:58 am
మల్లాపూర్ మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు, తాళం వేసి ఉన్న నాయిని అంజయ్య ఇంట్లో చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లారు. రెండు జ్యూవెల్లర్ షాపుల్లోని తాళాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ కు వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లో దొంగతనం జరిగినవాళ్లు మెట్పల్లిలో ఉంటారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు.