పాక్స్ సంఘాన్ని, ధాన్యం కొనుగోలు
కేంద్రాన్ని సందర్శించిన డిసిఓ
NEWS Nov 16,2024 07:55 am
మల్లాపూర్ PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో మనోజ్ కుమార్ సందర్శించారు. ధాన్యం తొందరగా తూకం వేసి రైస్ మిల్ కి తరలించి, రైతులకి డబ్బులు తొందరగా పడేలా చెయ్యాలని సూచించారు. అనంతరం పాక్స్ సంఘాన్ని సందర్శించారు. మొదటి సారి మల్లాపూర్కి వచ్చిన డీసీవోను పాక్స్ అధ్యక్షుడు వెంపేట నర్సారెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమం లో సెక్రటరీ భుమేష్, సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు.