అదుపుతప్పిన బస్సు.. పిల్లలు క్షేమం
NEWS Nov 16,2024 06:54 am
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకు వెళ్తున్న నందాస్ ప్రైవేటు స్కూల్ బస్ తిరుగు ప్రయాణంలో చిట్యాల శివారులో తాడ్వాయి రోడ్డులో అదుపు తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బయటికి వచ్చారని ఊపిరి పీల్చుకున్నారు.