సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. లోకేష్ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని.. హైదరాబాద్ వచ్చేశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం వాయిదా వేసుకుని ఢిల్లీ నుంచి వస్తున్నారు.