హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వయంగా హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతులకు అర్చకులు పట్టువస్త్రాలు బహూకరించారు.