కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు
NEWS Nov 15,2024 04:46 pm
పిచ్చికుక్క దాడిలో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నెత్తేట్ల వజ్రవ్వ(60), నెత్తేట్ల మహాన్వీ (3), నెత్తేట్ల విఘ్నేష్ (11), ముగ్గురు ఆరుబయట ఉండగా పిచ్చికుక్క దాడి చేసింది.దాంతో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం ముగ్గురిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పిచ్చికుక్కను వెంబడించడంతో పత్తి పొలాల్లోకి పరిగెత్తింది.