ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
NEWS Nov 15,2024 02:39 pm
మెట్పల్లి పట్టణంలోని ఆదర్శనగర్ గురుద్వారా వద్ద శుక్రవారం గురునానక్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ సిక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి లింగం, టి. అంజిరెడ్డి, మార్గం గంగాధర్, గురుద్వారా కమిటీ అధ్యక్షుడు చరణ్ సింగ్, బీఆర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.