కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఓ యువకుడు ఆర్టీసి బస్సు అద్దాలు పగలగొట్టాడు. గ్రామంలో నుండి బస్సు వెళుతుండగా తన పక్కనుండి బస్సు వెళ్లిందని అగ్రహించిన ప్రసాద్ అనే వ్యక్తి పైడిమడుగు గ్రామ శివారులో ఆర్టీసి బస్సుకి అడ్డంగా బైక్ నిలిపి అద్దాలు పగలగొట్టి, బస్సు డ్రైవర్ పై వాగ్వివాదానికి దిగాడు. ప్రయాణికులపై కూడా దురుసుగా ప్రవర్తించాడని డ్రైవర్ వాపోయాడు. పోలీసులకు,డిపో మేనేజర్ కి సమాచారం అందించారు.