పథకాలు అమలు చేసేందుకే సర్వే
NEWS Nov 15,2024 10:27 am
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. యజమాని ఇష్ట ప్రకారమే వివరాలు సేకరించాలన్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు.