రుషికొండ ప్యాలెస్.. కళ్లు తిరుగుతున్నాయ్
NEWS Nov 15,2024 09:54 am
AP: గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రూ.431 కోట్ల ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, దాన్ని చూస్తే తనకే కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. ‘రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవి’ అని పేర్కొన్నారు.