కోరుట్ల పట్టణంలో అయ్యప్ప మాలాధారణ
NEWS Nov 15,2024 09:36 am
కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నిత్యాభిషేకంలో భాగంగా ఉదయం స్వామి వారి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పాలెపు రాముశర్మ 35 మంది స్వాములకు అయ్యప్ప దీక్ష మాలాధారణ చేశారు. ఈరోజు వరకు 105 మంది స్వాములు దీక్ష తీసుకున్నట్లు అంబటి శ్రీనివాస్ తెలిపారు.