లక్ష్మీదేవీపల్లి ఆదివాసీ ఆత్మగౌరవ దివాస్
NEWS Nov 15,2024 10:28 am
TG: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఆదివాసీ ఆత్మగౌరవ దివాస్ వేడుకలు లక్ష్మీదేవీపల్లి గ్రామ పంచాయతీ ఘనంగా జరిగాయి .పీసా చట్టం,1/70చట్టం, ఆర్ఓఎఫ్ ఆర్ అటవిహక్కుల చట్టాలపై, ఆదివాసీ హక్కుల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెo శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సాంబయ్య, పీసా కమిటీ ఉపాధ్యక్షులు వి.కార్తీక్, కార్యదర్శి పూణె.మహా లక్ష్మి,పిహెచ్ సి డాక్టర్ పాయం.పుష్ప భారతి,ఏఎన్ఎం లక్ష్మి, ఆశ, యశోద, నాగేందర్, పుష్పరాజ్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.