ఘనంగా బాలల దినోత్సవం
NEWS Nov 15,2024 05:18 am
మెట్ పల్లి పట్టణంలోని వివేకనంద విద్యానికేతన్ హై స్కూల్ కళానగర్ లో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తరగతిలో బోధన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ.. బోధన చేయడం అంత సులువైన పని కాదని, ఎన్నో మెలుకువలు అవలంబించాల్సి ఉంటుందన్నారు. కరస్పాండెంట్ వేణుగోపాల్, చిన్నారులతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అని అన్నారు.