డిఎస్పీని కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్
NEWS Nov 14,2024 06:57 pm
మెట్ పల్లి: మెట్ పల్లి డీఎస్పీగా నియమితులైన రాములును గురువారం మెట్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన కూన గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు కిసాన్ సెల్ స్టేట్ జనరల్ సెక్రెటరీ వాకిటి సత్యం రెడ్డి తదితరులు ఉన్నారు.