భారీగా ట్రాఫిక్.. ప్రజలకు అంతరాయం
NEWS Nov 14,2024 06:58 pm
కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా నుండి వేములవాడ వెళ్లే దారిలో రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ప్రజలు భారీ సంఖ్యలో పూలు, దీపాలు, వత్తులు, పూజ సామాగ్రి కొనుగోలు కోసం బారులు తీరారు. ఈ క్రమంలో ప్రజలు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. ఇదే దారిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నందున అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్సులు పేషెంట్లు వస్తే తీవ్ర ఇబ్బందుల పడేవారు.