కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేపట్టారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ నిరంకుశ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.