తక్కళ్లపల్లి PACS చైర్మన్గా చంద్రశేఖర్
NEWS Nov 14,2024 04:27 pm
మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి PACS చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతక ముందు ఉన్న చైర్మన్ మధుకర్ మృతి చెందడంతో ఎలక్షన్ అధికారి మల్లేశం ఎన్నిక నిర్వహించగా, చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ మాట్లాడుతూ.. ఎన్నికకు సహకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్ ను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.