మాజీ ఎమ్మెల్యేకు నివాళులర్పించిన ఎంపీ
NEWS Nov 14,2024 02:04 pm
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిక్క ఇటీవల మృతి చెందగా గురువారం ఆమె కుటుంబ సభ్యులను ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. జ్యోతిదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, రమేష్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, విజయ్, రాఘవరెడ్డి, సాయి తదితరులు ఉన్నారు.