ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్ చేసిన సీఐ నిరంజన్ రెడ్డి
NEWS Nov 14,2024 10:07 am
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పంజాబ్లోని జలంధర్లో పట్టుకొని అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి గురువారం తెలిపారు. పంజాబ్ కు చెందిన సుమేశ్ కపూర్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాజీవ్ సింగ్, జతేంద్రకుమార్ అనే ముగ్గురు మరో ఇద్దరితో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. 2 నెలల క్రితం వీరు మెట్ పల్లికి చెందిన ఓ వైద్యుడి ఖాతా నుండి రూ.69 లక్షలు కాజేశారన్నారు.