రగ్బీ క్రీడలో దివ్య జాతీయ స్థాయికి ఎంపిక
NEWS Nov 14,2024 04:37 pm
మేడ్చల్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల విభాగంలో రగ్బీ పోటీలలో మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పి. దివ్య జాతీయ స్థాయికి ఎంపికైనట్టు పిడి శారదా తెలిపారు. ఈ సందర్భంగా దివ్యను చేగుంట మండల విద్యాధికారి నీరజ, ఉపాధ్యాయులు అభినందించారు