ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
NEWS Nov 14,2024 09:09 am
ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి మండలం MPPS వెంపేట పాఠశాలలో విద్యార్థులతో స్వయం పరిపాలన దినోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.