ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
NEWS Nov 14,2024 09:12 am
మల్యాల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్యాల కేంద్రంలోని స్థానిక వాగ్దేవి పాఠశాలలోని పిల్లలు టీచర్లుగా మారి విద్యను బోధించి, పలు వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం పిల్లలు, ఉపాధ్యాయులు ఒకరికొకరు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ నరేష్ పిల్లలను పిక్నిక్ తీసుకెళ్లారు. అక్కడ పిల్లలు ఆటపాటలతో, నృత్యాలతో సంతోషంగా గడిపారు.