తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
NEWS Nov 14,2024 07:06 am
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్కు అధికారులు స్వాగతం పలికారు. తన భార్య సునీతతో కలిసి ఈరోజు ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకుని, శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగారు.