మైనింగ్ శాఖకు చెందిన జగిత్యాల జిల్లా సహాయ సంచాలకులు జయసింగ్ బుధవారం మల్యాల మండలంలోని వరద కాలువ కట్ట మట్టిని పరిశీలించారు. త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారి నిర్మాణ పనులకు వినియోగించుకునేందుకు వీలుగా ఏ ప్రాంతంలోని వరద కాలువ మట్టి అనువుగా ఉంటుందన్న విషయమై పరిశీలించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.