రైతులను తప్పుదోవ పట్టించడానికే
MLA పాదయాత్ర: జువ్వాడి
NEWS Nov 14,2024 06:52 am
కోరుట్ల ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర రైతులను తప్పుదోవ పట్టించడానికే అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విమర్శించారు. జువ్వాడి భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. BRS చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని రైతులు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో BRS ప్రభుత్వం అసమర్థత వల్ల తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారని ధ్వజమెత్తారు.