తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా, కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జీగా మెట్పల్లి పట్టణానికి చెందిన జడల తిరుపతిని నియమిస్తూ. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా, నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షునికి తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు.