సౌతాఫ్రికాపై దంచికొట్టిన తెలుగు కుర్రాడు
NEWS Nov 13,2024 05:45 pm
టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సౌతాఫ్రికాపై దుమ్మురేపాడు.సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న మూడో T-20లో సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు బాది అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 56 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తిలక్ వర్మ పరుగుల వరద పారించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.