భోజన నాణ్యత పరిశీలించిన తహశీల్దార్
NEWS Nov 13,2024 05:17 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను తహశీల్దార్ సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారంగా భోజనం అందించాలని ఇబ్రహింపట్నం తహశీల్దార్ ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహరం అందించాలన్నారు. నిర్వహకులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.