జగిత్యాలకు రానున్న ఎంపీ అర్వింద్
NEWS Nov 13,2024 05:15 pm
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి గురువారం జగిత్యాలకు వస్తున్నట్లు జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డా. బోగ శ్రావణి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గం.లకు పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ(దిశ) సమావేశంలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.