గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
NEWS Nov 13,2024 05:08 pm
మల్లాపూర్ మండలం రత్నాపూర్ శివారులో గంజాయి సేవిస్తుండగా ఇద్దరు వ్యక్తులను మల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా రవితేజ, శివసాయి అనే యువకులు మెట్పల్లి పరిధిలోని పలు గ్రామాల్లో గంజాయి విక్రయిస్తున్నారని, వీరి నుంచి 200 గ్రాముల గంజాయి పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి తాగినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.