హనుమాన్ భక్తుల పాదయాత్ర
NEWS Nov 13,2024 05:19 pm
హైదరాబాద్ కు చెందిన వెంకటరెడ్డి, భూపతి రెడ్డి అనే ఇద్దరు హనుమాన్ భక్తులు హైదరాబాద్ నుండి పాదయాత్ర చేసి బుధవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువులపై జరుగుతున్న దాడులను, గోహత్యలను నిషేధించాలని కొండగట్టుకు పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. వీరు దాదాపుగా 170 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. వీరితోపాటు ఈ పాదయాత్రలో మెదక్ జిల్లాకు చెందిన నరసింహారెడ్డి పాల్గొన్నారు.