కృష్ణంపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
NEWS Nov 13,2024 05:36 pm
దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..రబీ సీజన్లో సాగుచేసిన పంటలకు భీమా చేసుకునే సౌకర్యం ఉందన్నారు. రైతులు డిసెంబర్ 15వ తేదీ లోపల పంటల భీమా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.